అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్ సీఎం మేనల్లుడు అరెస్ట్

అక్రమ మైనింగ్ కేసులో పంజాబ్  సీఎం  మేనల్లుడు అరెస్ట్

పంజాబ్ సిఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ ఇసుక మైనింగ్ కేసులో భూపేందర్ సింగ్ హనీని రోజంతా ప్రశ్నించిన ఈడీ  గురువారం సాయంత్రం అరెస్టు చేసింది. 2018అక్రమ ఇసుక మైనింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. జనవరి 18న భూపిందర్‌ సింగ్‌ ఇళ్లు, పలు కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఈడీ అరెస్ట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.