హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నంద కుమార్పై ఈడీ విచారణ ముగిసింది. రెండో రోజైన మంగళవారం అధికారులు అతడి నుంచి డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సర్వీసెస్ కీలక వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు, బంజారా హిల్స్ పీఎస్లో అతనిపై నమోదైన చీటింగ్ కేసుల్లో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలతో 15న కేసు రిజిస్టర్ చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
కోర్టు అనుమతితో నంద కుమార్ను ఈడీ అధికారులు మంగళవారం ప్రశ్నిం చారు. చంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విచారణ జరిపింది.

