ఫాంహౌస్ కేసు : నందకుమార్, రోహిత్ రెడ్డి సంబంధాలపై ఈడీ ఆరా

ఫాంహౌస్ కేసు : నందకుమార్, రోహిత్ రెడ్డి సంబంధాలపై ఈడీ ఆరా

ఫాం హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. లంచ్ కు ముందు వరకు నందకుమార్ వ్యక్తిగత వివరాలను మాత్రమే రికార్డు చేశారు. ఆయన వ్యాపారాలు, పరిచయాలపై ఆరా తీశారు. నందకుమార్ పార్ట్నర్గా ఉన్న  రోహిత్ రెడ్డి కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను సైతం ఈడీ రికార్డు చేసింది. అభిషేక్ ఆవుల ద్వారా పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక వ్యవహారాలపైనా అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

జైలర్ రూంలో నందు స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేస్తున్నారు. లంచ్కు ముందు గంటసేపు ప్రశ్నించిన ఈడీ.. 45 నిమిషాల భోజన విరామం అనంతరం మళ్లీ విచారణ ప్రారంభించారు. సాయంత్రం ఐదింటి వరకు ఈడీ విచారణ కొనసాగనుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున నంద కుమార్ను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ప్రశ్నిస్తున్నారు.