ఆన్​ లైన్​ పోర్టలా మజాకా... బైజూస్​ కంపెనీలో ఈడీ సోదాలు

ఆన్​ లైన్​ పోర్టలా మజాకా... బైజూస్​ కంపెనీలో ఈడీ సోదాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం (ఏప్రిల్ 29) బెంగళూరులోని రవీంద్రన్ బైజు అతని కంపెనీ 'థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'కి చెందిన మూడు ప్రదేశాల్లో  ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చట్టంలో నమోదైన కేసులో భాగంగా సోదాలు జరిపినట్టు ఈడీ వెల్లడించింది.   బైజూస్ పేరుతో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్‌ను నడుపుతోంది. ఈ తనిఖీల్లో సోదాల్లో వివిధ నేరాలకు సంబంధించిన డాక్యమెంట్లు, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నారు. 2011 మరియు 2023 మధ్య కాలంలో కంపెనీ 28 వేల  కోట్ల విలువైన  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్​డీఐ)  పెట్టినట్లు  ఈడీ అధికారులు తెలిపారు. అదే కాలంలో కంపెనీ 9754 కోట్ల రూపాయలు  ఓవర్సీస్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో పలు విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్లు తెలిపింది. కంపెనీ మార్కెటింగ్ ఖర్చుల పేరుతో దాదాపు రూ. 944 కోట్లను విదేశాలకు అక్రమంగా పంపినట్టు ఈడీ తెలిపింది.

అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ నిధులను స్వీకరించినట్లు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని ఈడీ వెల్లడించింది. దీనిపై పలుమార్లు రవీంద్రన్‌కు సమన్లు జారీ చేసిప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదని పేర్కొంది. దీంతో నేడు ( ఏప్రిల్​ 29)  ఆయన ఇల్లు, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. ‘‘2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదు. ఖాతాలను ఆడిటింగ్‌ చేయించలేదు’’ అని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.