మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది. ఆదివారం రాత్రి 9 గంటల పాటు విచారించిన ఈడీ అరెస్ట్ చేసినట్లు అర్థరాత్రి దాటాక ప్రకటించింది. సంజయ్ అరెస్ట్ తో శివసేన కార్యకర్తలు పలు చోట్ల నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
#WATCH | Shiv Sena leader Sanjay Raut being brought out of ED office in Mumbai. He is being taken to JJ Hospital for a medical checkup. pic.twitter.com/dOD7ZPntLu
— ANI (@ANI) August 1, 2022
పట్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో అధికారులు ఆదివారం ఆయన ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అనంతరం సంజయ్ను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్కు కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇంతకుముందు రెండుసార్లు ఆయనను ఆదేశించినా గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు ఆదివారం ఉదయం ఏడు గంటలకు సీఐఎస్ఎఫ్ బలగాలను వెంటపెట్టుకుని ముంబైలోని ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేశాయి. పట్రా చాల్ కేసులో విచారించేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.
మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసింది
అయితే తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్షతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను టార్గెట్గా చేసుకుందని సంజయ్ అన్నారు. ‘‘అన్నీ తప్పుడు సాక్ష్యాలే. ఈ స్కామ్కు, నాకు సంబంధం లేదు. శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ థాక్రేపై ఒట్టేసి చెబుతున్నా. చచ్చినా శివసేనను వదలను. కేంద్రానికి లొంగను. శివసేన కోసం పోరాడాలని థాక్రే మాకు నేర్పారు” అని సంజయ్ ట్వీట్ చేశారు. ఈడీ అధికారులు తన ఇంటికి చేరుకున్న కాసేపటికే రౌత్ ఈ ట్వీట్ చేశారు. తమ లీడర్ సంజయ్ను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని శివసేన ప్రెసిడెంట్ఉద్ధవ్ థాక్రే అన్నారు. తమ పార్టీని అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాగా, ‘‘మీరు (సంజయ్) ఏ తప్పూ చేయకుంటే ఈడీని చూసి ఎందుకు భయపడుతున్నరు?” అని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రశ్నించారు.
ఏంటీ పట్రా చాల్ కేసు?
మహారాష్ట్ర హౌసింగ్ఏరియా డెవలెప్మెంట్అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) కి చెందిన భూమిలో ఉంటున్న 672 మంది నిర్వాసితులకు ఫ్లాట్లు కట్టించి ఇచ్చేందుకు గతంలో హెచ్డీఐఎల్ అనుబంధ సంస్థ గురు ఆశిష్కన్స్ట్రక్షన్స్(జీఏసీ) ఒప్పందం కుదుర్చుకుంది. అయితే నిర్వాసితులకు ఫ్లాట్లు కట్టకుండా.. జీఏసీ ఆ భూమిని విక్రయించింది. రూ.1,039.79 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడింది. హెచ్డీఐఎల్2,700 కోట్ల లోన్ ఫ్రాడ్ చేసింది. ఇందులో జీఏసీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ రౌత్ కు రూ.100 కోట్లు ముట్టాయి. ఆ డబ్బును అతను కుటుంబసభ్యులకు బదిలీ చేశాడు. ప్రవీణ్ భార్య మాధురి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కు 2010లో 83 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ డబ్బుతో వర్ష దాదర్లో ఫ్లాట్ కొన్నారు. తర్వాత వర్ష అకౌంట్ నుంచి మాధురి అకౌంట్ కు రూ. 55 లక్షలు బదిలీ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో వర్ష, ప్రవీణ్రౌత్కు సంబంధించిన రూ.11.8 కోట్ల ప్రాపర్టీలను ఈడీ అటాచ్ చేసింది.