ఎలక్షన్ కమిషన్.. తుగ్లక్ కమిషన్ !.. బెంగాల్‌‌‌‌ సీఎం మమత ఫైర్

ఎలక్షన్ కమిషన్.. తుగ్లక్ కమిషన్ !.. బెంగాల్‌‌‌‌ సీఎం మమత ఫైర్

కోల్‌‌‌‌కతా: ఎలక్షన్​ కమిషన్​పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్​ కమిషన్.. తుగ్లక్​ కమిషన్ అని.. అది ఓ రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. మంగళవారం ఆమె బెంగాల్ ​సెక్రటేరియెట్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ ఐటీ సెల్‌‌‌‌లోని ఒక మహిళా కార్యకర్త బెంగాల్‌‌‌‌లో 58 లక్షల మంది ఓటర్ల పేర్లను ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​(ఏఐ) ఉపయోగించి తొలగించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎలక్షన్ ​కమిషన్ ​ధిక్కరిస్తోంది. ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది" అని ఆమె అన్నారు. ‘‘స్పెషల్​ ఇంటెన్సివ్ ​రివిజన్​(సర్) పేరుతో.. సాధారణ ప్రజల ఓటు హక్కును లాగేస్తున్నారు. వారిని టెర్రరిస్టుల్లా చూస్తున్నారు. బీజేపీని సంతృప్తి పరచడానికి బెంగాల్‌‌‌‌ను టార్గెట్ చేస్తున్నారు’’ అని మమత మండిపడ్డారు.