
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి ఎలక్షన్ ప్రాసెస్ మొదలుకానుంది. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఇతర పదవులను భర్తీ చేయనున్నారు. అయితే, పార్టీ పగ్గాలను మరోసారి చేపట్టాలని పలువురు నేతలు రాహుల్ గాంధీని కోరగా.. ఆయన మౌనం పాటిస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన రాహుల్.. 2019 జనరల్ ఎక్షన్ లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పదవి నుంచి తప్పుకొన్నారు.
అప్పటి నుంచి మళ్లీ సోనియా గాంధీనే పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. పార్టీ పగ్గాలను గాంధీ కుటుంబయేతర నేతకు అప్పగించాలంటూ పార్టీలో అసమ్మతి వర్గం నేతలు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు గాంధీ కుటుంబం అయితేనే పార్టీలో యూనిటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.