రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో విషాదం జరిగింది. ఎల్లమ్మ కళ్యాణ వేడుక జరుగుతుండగా విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
శుభకార్యంలో విషాదం.. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2024
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి చెందిన మల్లేష్ గౌడ్ ఇంట్లో ఎల్లమ్మ కల్యాణం జరిపించేందుకు వచ్చిన పెద్దమంగళారం గ్రామానికి చెందిన శివకుమార్ విద్యుత్ షాక్తో మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. pic.twitter.com/uF4HTaIvFd
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి చెందిన మల్లేష్ గౌడ్ ఇంట్లో ఎల్లమ్మ కల్యాణం జరిపించేందుకు వచ్చిన పెద్దమంగళారం గ్రామానికి చెందిన శివకుమార్ విద్యుత్ షాక్తో మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరు నిలబడి వేడుక నిర్వహిస్తుండగా.. చేతిలో మైక్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడున్నవారంతా అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారికి కూడా కరెంట్ షాక్ రావడంతో దూరంగా పారిపోయారు. గాయాలైన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.