
- చర్యలకు ఉపక్రమించిన విద్యుత్ శాఖ
దిల్ సుఖ్ నగర్, వెలుగు: చైతన్యపురి మెట్రో రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ బకాయికి సంబంధించి టీజీఎస్పీడీసీఎల్ సంస్థ జప్తు నోటీసు అంటించింది. రూ. 31,829 బకాయి ఉన్నట్లు అందులో పేర్కొంది. ‘మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేట్’ పేరుతో 2015 జులై 23న మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏజెన్సీ వెళ్లిపోయింది.
2021 డిసెంబరు నాటికి బకాయి ఉన్న మొత్తాన్ని మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ నుంచి వసూలు చేసేందుకు టీజీఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరూర్ నగర్ ఆపరేషన్స్ ఏఈ మెట్రోస్టేషన్కు జప్తు నోటీసు అంటించారు. విద్యుత్ కనెక్షన్ మెస్సర్స్ థేల్స్ పేరుతో ఉన్నందున వారి చిరునామా, నంబరును కనుగొనడానికి జప్తు నోటీసు అందించినట్లు విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు.