ఏటీఎంలలో చిలక్కొట్టుడు కొడుతుంటే.. ఏడాది తర్వాత బయటపడింది

ఏటీఎంలలో చిలక్కొట్టుడు కొడుతుంటే.. ఏడాది తర్వాత బయటపడింది

 

  • ఏటీఎంలలో నగదు పెట్టేటప్పుడే కొంత కొట్టేస్తున్నారు
  •  ఎవరికీ అనుమానం రానివ్వకుండా సాగుతున్న నలుగురు ఉద్యోగుల హస్తలాఘవం
  • ఏడాది నుండి కొట్టేసిన చిలక్కొట్టుడు మొత్తం కోటి 39 లక్షలు పైనే
  • అనుమానంతో నిఘా పెట్టి గుర్తించిన బ్యాంకర్లు..
  • పరారైన నలుగురు ఉద్యోగులు

జనగామ జిల్లా: ఏటీఎంలను చోరీ చేసేందుకు దొంగలు చేస్తున్న ప్రయత్నాలను వింటున్నాం..చూస్తున్నాం.. వారి నుంచి స్ఫూర్తి పొందారో ఏమో గాని.. ఏకంగా ఏటీఎం మిషన్లలోనే డబ్బులు డిపాజిట్ చేసే కంపెనీ ఉద్యోగులు తిన్నింటి వాసాలు లెక్కకట్టారు. ఎవరికీ అనుమానం రాని రతిలో గుట్టు చప్పుడు కాకుండా.. అప్పుడప్పుడు కొంచెం.. కొంచెం నగదు కొట్టేస్తూ వస్తున్నారు. అంటే నగదు డిపాజిట్ చేస్తున్నప్పుడే కొంచెం మొత్తం జేబుల్లో వేసుకుని.. మిషన్లలో తక్కువగా  పెట్టేస్తున్నారు. ఏటీఎం లావాదేవీలన్నీ గమనిస్తున్న సిబ్బందికి.. తరచూ కొంచెం కొంచెం నగదు తక్కువగా వస్తోంది. తేడా వస్తుండడంతో అదేపనిగా లెక్కలు చెక్ చేసుకునేవారు. ఒకరికి ఇద్దరు.. నలుగురు చెక్ చేసినా.. డిపాజిట్ చేసేటప్పుడే తక్కువ మొత్తం పెట్టేస్తున్నారనే అనుమానం వచ్చింది. దీంతో బ్యాంకర్లు నిఘా పెట్టారు. ఇంకేముంది.. ఇంటి దొంగల పనేనని తేలింది. ఎక్కువ మొత్తం కాకుండా.. అప్పుడప్పుడు.. కొంచెం.. కొంచెం వీలున్నప్పుడంతా కొంచెం తక్కువ మొత్తం పెట్టేస్తున్నారు. లావాదేవీల్లో ఎవరికైనా తేడా వచ్చిందేమోనని బ్యాంకర్లు అనుకునేవారు. అది టెక్నికల్ ట్రబుల్ సమస్య కాదని గుర్తించారు. పకడ్బందీగా నిఘా పెట్టి.. అదనంగా సీసీ కెమెరాలతో తనిఖీలు చేయగా ఇంటిదొంగల గుట్టు బయటపడింది. నలుగురు ఉద్యోగులు పథకం ప్రకారం కుమ్ముక్కయి.. ఏడాది కాలంగా కొంచెం.. కొంచెం కొట్టేయడం అలవాటు చేసుకున్నట్లు తేలింది. ఏటిఎంలలో నగదు జమ చేసే  రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నజనగామ కు చెందిన పాశికంటి వెంకటేష్, గుర్రం ఉపేందర్, చైతన్యకుమార్, గట్టు రాజు లపై సాక్షాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటిఎంలో నగదు జమ చేసే క్రమంలో సంవత్సర కాలంగా వీరు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు స్వాహా చేసినట్లు ఫిర్యాదు చేశారు. తమ బండారం బయటపడడంతో నలుగురు ఉధ్యోగులు పరారయ్యారు. జనగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.

for more news..

ఏడేళ్లకే ఐటీ కంపెనీ..13 ఏళ్లకే బీటెక్ స్టూడెంట్స్‌కు క్లాసులు

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్