టీ20 వరల్డ్ కప్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు గాను 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.
టార్గెట్ చేజింగ్ లో న్యూజిలాండ్ 159 పరుగులు మాత్రమే చేసింది. విలియమ్సన్ 40, ఫిలిప్స్ 62 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, సామ్ కరన్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు. ఐర్లాండ్తో జరిగే చివరి మ్యాచ్లో కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడినా... వర్షం కారణంగా మ్యాచ్ రద్దైన కివీస్ సెమీస్ కు చేరడం కష్టమే అవుతోంది. కివీస్ పై విక్టరీతో ఇంగ్లండ్ సెమీస్ రేసులో నిలిచింది.