కరోనా ఎఫెక్ట్ .. మేం ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వం

కరోనా ఎఫెక్ట్ .. మేం ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వం

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నకరోనా వైరస్ తో అందరు అలర్ట్ అవుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపిస్తున్న ఈ వైరస్ దాటికి ముఖ్యంగా విదేశీ టూర్ లకు వెళ్తున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా క్రికెటర్లకు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 19 న శ్రీలంకతో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో అక్కడి క్రికెటర్స్ కు  షేక్ హ్యాండ్ ఇవ్వబోమని ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ జోరూట్ చెప్పాడు. ఇటీవలే సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. 10 మంది ఆటగాళ్లతో పాటు కొంతమంది సిబ్బంది అంతు చిక్కని వైరస్ తో బాధపడ్డారు. దీంతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.