- ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగు నీరు
హైదరాబాద్, వెలుగు: కొడంగల్–నారాయణపేట లింక్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న దరఖాస్తు చేయగా.. 27న జరిగిన మీటింగ్లో అప్లికేషన్ను స్టేట్ లెవెల్ఎన్విరాన్మెంట్ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) పరిశీలించింది. 29న పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. కాగా, నారాయణపేట, మక్తల్, కొడంగల్నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేలా 4 టీఎంసీలను ఎత్తిపోసేందుకు రాష్ట్ర సర్కారు ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
3 దశల్లో నీటిని రాజీవ్భీమాఎత్తిపోతల పథకం నుంచి ఎత్తిపోయనున్నారు. మొదటి దశలో భూత్పూర్ రిజర్వాయర్నుంచి వూట్కూర్ చెరువుకు, రెండో దశలో వూట్కూర్చెరువు నుంచి జయమ్మ చెరువుకు, మూడో దశలో జయమ్మ చెరువు నుంచి కనకుర్తి చెరువుకు నీటిని ఎత్తిపోస్తారు.
ఇందులో భాగంగా కనకుర్తి చెరువు నుంచి దౌల్తాబాద్చెరువుకు 17.675 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలించనున్నారు. దీంతోపాటు మధ్యలో వచ్చే లక్ష్మీపూర్, ఈర్లపల్లి చెరువులనూ నింపనున్నారు. ఇక, దౌల్తాబాద్ చెరువు నుంచి బొంరాస్పేట చెరువుకు 31.568 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలిస్తారు. హుస్నాబాద్, కొడంగల్చెరువులనూ నింపుతారు.
