రైతుల పొట్టగొట్టే బిల్లులను వెంటనే రద్దు చేయాలి

రైతుల పొట్టగొట్టే బిల్లులను వెంటనే రద్దు చేయాలి

వరంగల్ అర్బన్ జిల్లా  : కేంద్రం తెచ్చిన మూడు బిల్లులతో రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం ఆయన వరంగల్ లో మాట్లాడుతూ..8న భారత్ బంద్ కు తమ మద్దతు ఉంటుందన్నారు. భారత్ బంద్ ను ప్రజలు విజయవంతం చేయాలని..రైతుల పొట్టగొట్టే బిల్లులను వెంటనే రద్దు చేయాలన్నారు.

12 వరకు బంద్, ఆ తర్వాత హైవేలా దిగ్భంధం చేస్తామన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని..ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ తరఫున అభినందనల అన్నారు. మార్కెట్లు మూతపడే ప్రమాదం ఉందని..బీజేపీ పార్టీకి ఆపార్టీలో ఉన్న రైతులు కూడా బుద్ధి చెప్పాలన్నారు. 8న టీఆర్ఎస్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా రోడ్లపైకి రావాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.