త్వరలో వరంగల్​లో బీజేపీలోకి చేరికలు 

త్వరలో వరంగల్​లో బీజేపీలోకి చేరికలు 
  • ఎమ్మెల్యే బెదిరింపులు చెల్లవ్
  • త్వరలో.. వరంగల్​లో బీజేపీలోకి చేరికలు 
  • హుజూరాబాద్‍ ఎమ్మెల్యే ఈటల

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ కక్షసాధింపు చర్యలు, బెదిరింపులు ఇక చెల్లవని హుజూరాబాద్‍ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్‍ అన్నారు. వరంగల్‍ బ్యాంక్‍ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్‍ నేత పూజారి సత్యనారాయణ అనారోగ్యం బారినపడటంతో తూర్పు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‍రావుతో కలిసి సోమవారం అయనను ఈటల పరామర్శించారు. తెలంగాణ జనవేదిక కన్వీనర్‍ తక్కళ్లపల్లి రామురావు తండ్రి, మాజీ మంత్రి పురుషోత్తంరావు కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. అనంతరం వరంగల్​లోని పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగాల సమ్మిరెడ్డి నివాసంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు మోహన్‍, బుజ్జిగొండ శ్రీనివాస్‍ తదితరులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వనించారు. టీఆర్‍ఎస్‍ కు, తూర్పు ఎమ్మెల్యేకు గడ్డు రోజులు మొదలయ్యాయని, ఇకపై అతని జులుం చెల్లదని ఈటల అన్నారు. ఎలక్షన్లకు ఇంకా  టైం ఉండటంతో చాలామంది లీడర్లు బలవంతంగా టీఆర్‍ఎస్​లో  ఉంటున్నారన్నారు. వరంగల్​ జిల్లాకు చెందిన టీఆర్​ఎస్​ లీడర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు తమతో టచ్​లో ఉన్నారని, వాళ్లంతా త్వరలోనే బీజేపీలోకి  వస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మందాడి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర నేత  ఏనుగుల రాకేశ్‍రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.