పీహెచ్​డీకి ముందు ఎథిక్స్​ కోర్సు

పీహెచ్​డీకి ముందు ఎథిక్స్​ కోర్సు

ఆర్​పీఈ కోర్సును తీసుకొచ్చిన యూజీసీ

30 గంటల పాటు క్లాసులు.. అన్ని యూనివర్సిటీలకూ యూజీసీ సర్క్యులర్​

కాపీ థీసిస్​, అనైతిక ప్రాక్టీస్​లకు చెక్​ పెట్టేందుకే

సిలబస్​ కూడా ఫైనల్​.. మంచి నిర్ణయమంటున్న స్టూడెంట్లు

పీహెచ్​డీ చేయాలనుకునే స్టూడెంట్లకు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ (యూజీసీ) కొత్త రూల్​ పెట్టింది. ఎథిక్స్​ (నైతిక విలువలు), పబ్లికేషన్​ మిస్​కండక్ట్​ను తెలియజెప్పే కోర్సును  తప్పనిసరి చేసింది. అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు గురువారం సర్క్యులర్​నూ పంపించింది. ఎథిక్స్​, పబ్లికేషన్​ మిస్​కండక్ట్​ కోర్సులకు సంబంధించి టూ–క్రెడిట్​ కోర్సు ‘రీసెర్చ్​ అండ్​ పబ్లికేషన్​ ఎథిక్స్​ (ఆర్​పీఈ)’ని కచ్చితంగా స్టూడెంట్లకు చెప్పాలని ఆదేశించింది. పీహెచ్​డీకి దరఖాస్తు చేసుకుని, సీటు పొందిన విద్యార్థులకు ముందుగానే ఈ 30 గంటల కోర్సును టీచ్​ చేయాలని ఆదేశించింది. రీసెర్చ్​ పేపర్ల క్వాలిటీని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఎదుటి వాళ్ల రీసెర్చ్​ థీసిస్​ను కాపీ కొట్టకుండా, ఓ టాపిక్​కు సంబంధించి రీసెర్చ్​ను ఎలా చేయాలో ఆ కోర్సు ద్వారా స్టూడెంట్లకు బోధించాలని చెప్పింది. ‘‘దేశంలో చేస్తున్న రీసెర్చ్​ క్వాలిటీ ఏం బాగుండట్లేదు. ఎదుటోళ్ల థీసిస్​ను కాపీ కొడుతున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. అందుకే ఈ ఆర్​పీఈ కోర్సును తీసుకొచ్చాం” అని యూజీసీ సెక్రటరీ రజనీశ్​ జైన్​ చెప్పారు.

సిలబస్​ ఏంటి?

ఆర్​పీఈ కోసం ఇప్పటికే యూజీసీ సిలబస్​ను కూడా కన్ఫర్మ్​ చేసింది. ఫిలాసఫీ, ఎథిక్స్​, సైంటిఫిక్​ కండక్ట్​లపై స్టూడెంట్లకు టీచింగ్​ చేయనున్నారు. ఇంటలెక్చువల్​ హానెస్టీ (మేధో నిజాయితీ) గురించి చెప్పడంతో పాటు, తప్పుడు ఆర్టికల్స్​, ఉన్నవీ లేనివి కల్పించి రాయడం, కాపీ కొట్టడం వంటి వాటికి ఎలా దూరంగా ఉండాలో కోర్సులో భాగంగా స్టూడెంట్లకు చెప్పనున్నారు. డేటా వంటి ఓపెన్​ రీసోర్సెస్​ను వాడుకునే విధానం గురించి బోధిస్తారు. పబ్లికేషన్​ మిస్​కండక్ట్​కు సంబంధించి విదేశాలు, ఇండియాలో నమోదవుతున్న ‘మోసపూరిత ఆర్టికల్స్​’ ఫిర్యాదులపై ఉదాహరణలతో పాఠాలు చెబుతారు. వాటికి సంబంధించి కాపీరైట్​ సమస్యలు, కాపీ కొడితే ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తారు. తుర్నితిన్​ వంటి ప్లాగియారిజం టూల్స్​ గురించీ స్టూడెంట్లకు చెప్తారు.

35 శాతం ఆర్టికల్స్​ ఫేక్​ జర్నల్స్​లోనివే

ప్రస్తుతం దేశంలో రీసెర్చ్​ స్టూడెంట్స్​ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఫేక్​ జర్నల్స్​ అని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫేక్​ జర్నల్స్​లోని ఆర్టికల్స్​లో కొన్ని మార్పులు చేసి కాపీ పేస్ట్​ చేస్తున్నారని చెప్పింది. దాదాపు 35 శాతం అలాంటి ఆర్టికల్స్​ను రీసెర్చ్​ స్టూడెంట్లు ప్రొడ్యూస్​ చేశారని తెలిపింది. అందుకే ఈ ఏడాది జులైలో యూజీసీ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ‘కేర్​’ లిస్ట్​ పేరిట గుర్తింపు పొందిన జర్నల్స్​తో ఓ జాబితాను తయారు చేసింది. ఆ జాబితాలోని జర్నల్స్​లో పబ్లిష్​ అయిన రీసెర్చ్​ ఆర్టికల్స్​నే అకడమిక్​ పర్పస్​ కోసం వాడుకోవాలని సూచించింది.

స్టూడెంట్లు ఏమంటున్నరు

ఈ కొత్త కోర్సుపై చాలా మంది స్టూడెంట్లు పాజిటివ్​గానే ఉన్నారు. ‘‘యూజీసీ రూల్స్​ ప్రకారం స్టూడెంట్లంతా ప్రీ పీహెచ్​డీ కోర్స్​ వర్క్​ చేయడం తప్పనిసరి. కోర్సులో భాగంగా రీసెర్చ్​లో నైతిక విలువలు, పబ్లికేషన్​ గురించి చెప్పడమన్నది మంచి నిర్ణయం. రీసెర్చ్​ కోసం ఏ సోర్స్​ వాడుకోవాలో, కాపీ కొట్టకుండా ఉండడమెలాగో చాలా మందికి  తెలియదు. కాబట్టి వీటన్నింటిపై అందరికీ అవగాహన అవసరం” అని పీహెచ్​డీ కోసం అప్లై చేసుకున్న దీక్ష భతేజా అనే స్టూడెంట్ చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్​డీ ఫైనల్​ ఇయర్​ చేస్తున్న మమత త్రిపాఠీ అనే స్టూడెంట్ కూడా ఇదే చెప్పింది. తాను పీహెచ్​డీ స్టార్ట్​ చేసిన మొదట్లో ప్రతి విషయానికీ గైడ్​ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేదని, సోర్సింగ్​, ఇండెక్సింగ్​ వంటి వాటినీ అడిగి తెలుసుకోవాల్సి వచ్చేదని తెలిపింది. కాబట్టి స్టూడెంట్లకు ముందే వాటిపై బేసిక్స్​ చెబితే రీసెర్చ్​ ఈజీగా సాగుతుందని అభిప్రాయపడింది. దేశంలో కాపీ రీసెర్చ్​లు, అనైతిక ప్రాక్టీస్​లు ఎక్కువైపోతున్నాయని, ఈ కోర్సు పెట్టడం  జేఎన్​యూలో స్కూల్​ ఆఫ్​ సోషల్​ సైన్సెస్​ ప్రొఫెసర్​ బిక్రమాదిత్య కుమార్​ చౌదరి అన్నారు.