హైదరాబాద్, వెలుగు: సిటీలో గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాలు మొదలై 10 రోజులు దాటినా ప్రభుత్వ నుంచి ఫండ్స్ రాలేదని.. అప్పులు చేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. బల్దియా పరిధిలో ఉన్న అమ్మవారి ఆలయాలకు ప్రభుత్వం గుడిని బట్టి రూ.3 వేల నుంచి ఆర్థిక సాయన్ని అందిస్తుంది. అత్యధికంగా గోల్కొండ ఆలయానికి రూ.15 లక్షలు ఇస్తుంది. కానీ నేటికీ ఫండ్స్ రాలేదని కమిటీ సభ్యులు అంటున్నారు. ఆదివారం గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారికి నాలుగో పూజ నిర్వహించనున్నారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.