ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కుపై స్టార్ క్యాంపెయినర్ జబర్దస్త్ రాజమౌళి, స్పెషల్ ప్రకటనలు, వాయిస్ మెసేజ్ ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రేమలత, సాంస్కృతిక సారథి బృందం సభ్యులు మెరుగు రవీందర్, బండ వెంకన్న, ఆశ, కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.