బైకును ఢీ కొన్న కారు.. కారు నడిపింది మాజీ మంత్రి అల్లోల చుట్టం..

బైకును ఢీ కొన్న కారు.. కారు నడిపింది మాజీ మంత్రి అల్లోల చుట్టం..

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. కూకట్ పల్లిలోని కేపీహెచ్ బీలోని ఫోరం మాల్ సర్కిల్ వద్ద తెల్లవారు జామున మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీప బంధువు అగ్రజ్ రెడ్డి తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగి కారును రాంగ్ రూట్లో నడిపాడు. ఎదురుగా వస్తున్న బైక్ ను బలంగా  ఢీకొట్టాడు. బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

 ఈ ఘటన పై కూకట్ పల్లి ఏసీపీ శివ భాస్కర్ మాట్లాడుతూ  మద్యం మత్తులో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీప బంధువు అని ఏసీపీ శివ భాస్కర్ తెలిపారు. అగ్రజ్ రెడ్డి పై కేసు నమోదు చేశామని అన్నారు. మద్యం మత్తులో AP07E3839 కారు అర్థ రాత్రి సమయంలో కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్సస్ మాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న   AP08FE4711 బైక్ పై వెళ్తున్న భన్వర్లాల్, దూర్ చంద్ అనే అన్నదమ్ములును ఢీ కొట్టిందని తెలిపారు.

 దీంతో వారి ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఇరువురికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఆ కారులో ఉన్నది అగ్రజ్ రెడ్డి అని తేలిందన్నారు.  ఘటన పై దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ శివ భాస్కర్ తెలిపారు.