మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యనించింది. శ్రీనివాస్ గౌడ్ కు గన్ మెన్ లు అవసరమో లేదో తెలపాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2024 మార్చి 19 కి వాయిదా వేసింది హైకోర్టు.