చిన్నపిల్లల్లో పెరుగుతున్న మయోపియా(సైట్) సమస్యలపై ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నవంబర్ 10 నుంచి 16 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ముగింపు సందర్భంగా కల్లం అంజిరెడ్డి క్యాంపస్ నుంచి కేపీఆర్ పార్క్ వరకు 600 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులతో ‘చిల్డ్రన్ ఐ కేర్ అవేర్నెస్’ వాక్థాన్ నిర్వహించారు.
