నకిలీ విత్తనాలు రైతుల్ని నిండా ముంచాయి

నకిలీ విత్తనాలు రైతుల్ని నిండా ముంచాయి

నకిలీ విత్తనాలు రైతుల్ని నిండా ముంచాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్ఠికుంటలో 150ఎకరాల్లో బిగ్ బాస్ సిడ్ విత్తనాలు వేశారు. అయితే చెట్టు పెరిగినా కాయలు మాత్రం కాయలేవని రైతులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని సీడ్ డీలర్ కి చెబితే తమకు సంబంధం లేదని చెబుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. వెంటనే బిగ్ బాస్ నిర్వహకులు, పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.