రైలు ప్రమాదంతో.. రద్దయిన, మళ్లించిన రైళ్లు ఇవే

 రైలు ప్రమాదంతో.. రద్దయిన, మళ్లించిన రైళ్లు ఇవే

హౌరా - సికింద్రాబాద్ ట్రైన్ ఆక్సిడెంట్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించింది. ప్రయాణికులు వాటి వివరాలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 

రద్దయినవి..

సికింద్రాబాద్ - రేపల్లె 
సికింద్రాబాద్ - మన్మాడ్ 

దారి మళ్లించినవి..

సికింద్రాబాద్ - తిరువనంత పురం 
సికింద్రాబాద్​ - హౌరా 
విశాఖపట్నం - లింగం పల్లి 
నర్సాపూర్ - నగరసోల్

రైలులో మంటలు చెలరేగిన ఘటనలో మొత్తం 11 బోగీలకు గానూ 3 పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రయాణికులంతా సేఫ్​గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.