
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో నిరసనకు దిగింది ఓ కుటుంబం. గ్రామంలో కొందరు టీఆర్ఎస్ నేతలు స్థలాన్ని తనకు అమ్మారని ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తుండగా అదే టీఆర్ఎస్ నేతలు అధికారులకు ఫిర్యాదు చేసి ఇంటికి పర్మిషన్ లేదంటూ జేసీబీ తో కూల్చేయడంతో తంగళ్లపల్లి మండలం పద్మనగర్ కు చెందిన సంతోష్ కుటుంబం ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగారు. గతంలో ఒప్పందం జరిగి సంవత్సరమైన ఇంత వరకు న్యాయం జరగలేదని నివాస స్థలాన్ని ఇవ్వకుండా చుట్టూ తిప్పించుకుంటున్నారని సంతోష్ కుటుంబం ఆరోపిస్తోంది. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులను సైతం లోపలికి రానివ్వకుండా కుటుంబ సభ్యులతో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు. నా కుటుంబానికి న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా కుటుంబమంత ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటమంటున్నారు బాధితులు. కేటీఆరే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.