డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. బంధువుల ఆందోళన

డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. బంధువుల ఆందోళన

ఓ డాక్టర్ నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోయాడంటూ డెడ్ బాడీతో నిరసన తెలిపారు అతని బంధువులు. జగిత్యాలలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు బాధితులు. హెర్నియా ఆపరేషన్ కోసం సతీష్ అనే వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల కిందట అక్కడి డాక్టర్ ఆపరేషన్ చేశాడు. అయితే సతీష్ పరిస్థితి సీరియస్ గా ఉందని వేరే హాస్పిటళ్లకు పంపించాడన్నారు బంధువులు. చివరకు కరీంనగర్ లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి సతీష్ చనిపోయాడని చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.