అమితాబ్‌ మీరు ఇంట్లోనే ఉండండి.. దయచేసి ఫైనల్‌ మ్యాచ్ చూడొద్దు

అమితాబ్‌ మీరు ఇంట్లోనే ఉండండి..  దయచేసి ఫైనల్‌ మ్యాచ్ చూడొద్దు

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే టైమ్ ఉంది. ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.  ఈ మ్యాచ్ ను చూసేందుకు సామాన్య ప్రజలతో పాటుగా దేశంలోని ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను మాత్రం ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.  ఎందుకంటే అమితాబ్ మ్యాచ్ చూస్తే టీమిండియా ఓడిపోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు కాబట్టి.  

అయితేఈ నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించింది అమితాబే కావడం విశేషం.  సెమీస్‌లో కివీస్‌పై టీమ్‌ఇండియా విజయం తర్వాత.. ‘‘నేను చూడనప్పుడే మనం గెలుస్తాం’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అమితాబ్ ను మ్యాచ్ చూడోద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై అమితాబ్ మరో ట్వీట్ చేశారు.  ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ALSO READ :-ఈసారి ఇడువొద్దు .. ఆసీస్‌‌‌‌‌‌‌‌తో అంత ఈజీ కాదు..