ధరణిలో భూమి నమోదు చేయట్లేదని.. ఉరేసుకున్న రైతు

ధరణిలో భూమి నమోదు చేయట్లేదని.. ఉరేసుకున్న రైతు

ధరణిలో తన భూమి ఎక్కలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లికి చెందిన చింతల స్వామి ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 14 గంటల భూమి ధరణిలో నమోదు కాకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరిగి... సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చింతల స్వామి బతుకుదెరువు కోసం హైదరాబాదులోని నాగారంలో ఉంటున్నాడు. తమకున్న పొలంలో కొంత భాగం అప్పుల కోసం మృతుడి తండ్రి అమ్మాడు. మిగిలిన భూమి.. ఆఫీసుల చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా.. తమ పేరు మీద ఎక్కించలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు బంధువులు.