అన్నం పెట్టే భూముల్లోంచి రోడ్లేస్తరా?

అన్నం పెట్టే భూముల్లోంచి రోడ్లేస్తరా?

హుజూరాబాద్​లో బైపాస్ సర్వే పనుల్ని అడ్డుకున్న రైతులు

హుజూరాబాద్, వెలుగు: బైపాస్ పనుల సర్వేను బుధవారం హుజూరాబాద్​లో  రైతులు అడ్డుకున్నారు. అన్నం పెట్టే భూముల్లో రోడ్డు పనులు వద్దంటూ రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అత్మహత్యకు చేసుకుంటామని పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్, సిర్పపల్లి గ్రామాల శివారులో అధికారులు రోడ్డు సర్వే పనులు చేస్తుండగా అన్ని చోట్లా రైతులు అడ్డుకున్నారు. రెండు పంటలొచ్చే ఈ భూముల్లోంచి రోడ్లేస్తే తాము ఎలా బతకాలని నిలదీశారు. సర్వే పనులను ఆపాలంటూ ఆర్డీవో బెన్​షాలోం కాళ్లమీద పడి వేడుకున్నారు. రోడ్డు సర్వే పనుల వల్ల ఎలాంటి నష్టం ఉన్నా.. తెలియజేయాలని, ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేసి నష్ట పరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. నష్టంపై ఆఫీస్​కు వచ్చి తెలియజేయాలని ఆర్డీవో వారికి సూచించారు.