ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత.. సీజ్ ఫైర్ డీల్ రద్దు..?

ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత.. సీజ్ ఫైర్ డీల్ రద్దు..?

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా కనిపించడం లేదు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ చేసిన ఈ వైమానిక దాడుల్లో లెబనాన్లోని బీరూట్లో దాదాపు 89 మంది చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటంపై ఇరాన్ సీరియస్ అయింది.

హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో.. చమురు ట్యాంకర్లతో హార్మూజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు సిద్ధమైన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లైట్ తీసుకోవడంతో ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్లీ యుద్ధంలోకి దిగాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 

►ALSO READ | సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. మిస్సైల్స్తో లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ !

ఇదే గానీ జరిగితే.. ఈ రెండు వారాల సీజ్ ఫైర్ ఒప్పందం ఒక్కరోజులోనే అటకెక్కినట్టే. అయితే.. లెబనాన్ పై దాడులను ఇజ్రాయెల్ సమర్ధించుకుంది. ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సీజ్ ఫైర్ డీల్ లెబనాన్కు వర్తించదని.. ఈ సీజ్ ఫైర్ డీల్లో లెబనాన్కు చోటు లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు.

హార్మూజ్ తిరిగి అందుబాటులోకి వచ్చాక.. రెండు నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మెరైన్ ట్రాఫిక్ బుధవారం తెలిపింది. తిరిగి.. మళ్లీ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని.. చమురు సంక్షోభం తప్పేలా లేదని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది.