కాళేశ్వరం భూ సర్వేను అడ్డుకున్న రైతులు

కాళేశ్వరం భూ సర్వేను అడ్డుకున్న రైతులు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేపట్టిన భూ సర్వేను గంగాధర మండలం కొండన్నపల్లి, రంగారావు పల్లి రైతులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ తరలించేందుకు అవసరమైన భూ సేకరణ సర్వేను చేపట్టేందుకు అధికారులు రాగా అన్నదాతలంతా కలసి అడ్డుకున్నారు. ఇప్పటికే కోల్పోయిన భూమికి పరిహారం ఇవ్వలేదని... ఇప్పుడు మరోసారి భూమిని ఇవ్వబోమని ఆందోళన చేశారు. 
నచ్చ చెప్పేందుకు పోలీసులు వచ్చినా వారు ససేమిరా అన్నారు.  రైతుల ఆందోళనలకు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మద్దతు తెలిపారు. గంగాధర ఎమ్మార్వో డౌన్ డౌన్.. రైతుల హక్కులను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.