నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలోని శ్రీకర్ రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మిల్లర్లు సిండికేట్ గా మారి తక్కువ రేటుకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పించకుండా మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేంత వరకు కదిలేదే లేదంటున్నారు అన్నదాతలు. దీంతో రైస్ మిల్లు ముందు భారీగా ధాన్యపు ట్రాక్టర్ల లైన్ కనిపిస్తున్నాయి.