మొక్కజొన్న సాగుపై సెల్‌టవర్ ఎక్కి రైతుల నిరసన

మొక్కజొన్న సాగుపై సెల్‌టవర్ ఎక్కి రైతుల నిరసన

మహబూబాబాద్ జిల్లా: మొక్కజొన్న సాగుపై అన్నదాతల ఆందోళనలు ఆగడంలేదు. మొక్కజొన్న సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మొక్కజొన్న పంటసాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు రైతులు.