మోడీ తలుచుకుంటే రైతుల సమస్యలకు 5 నిమిషాల్లో పరిష్కారం

మోడీ తలుచుకుంటే రైతుల సమస్యలకు 5 నిమిషాల్లో పరిష్కారం

ముంబై: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ప్రధాని మోడీ తలచుకుంటే రైతుల నిరసనలకు 5 నిమిషాల్లో ముగింపు పలకొచ్చన్నారు.

‘అన్నదాతల ఆందోళనలను ముగించాలని ప్రభుత్వం కోరుకుంటే వారితో కూర్చొని చర్చలు జరిపాలి. కేవలం అరగంటలో ఈ సమస్యను పరిష్కరించొచ్చు. ఒకవేళ ప్రధాని మోడీయే స్వయంగా ఈ విషయాన్ని పరిష్కరించాలని భావిస్తే మాత్రం 5 నిమిషాలు చాలు. మోడీ జీ చాలా పెద్ద నేత. ఆయన మాటను అందరూ వింటారు. కావాలంటే ఆయనతో ఒకసారి చర్చలకు రైతులను ఆహ్వానించి చూడండి. తప్పక అద్భుతం జరుగుతుంది’ అని రౌత్ చెప్పారు.