
గండిపేట్, వెలుగు: అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతుల సమస్యల పరిష్కారం కోసం కొత్త వ్యూహాలు రచించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. వర్సిటీ 61వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం రాజేంద్రనగర్లోని ఆడిటోరియంలో జరిగ్గా.. ఆయన గెస్ట్గా హాజరయ్యారు. హైదరాబాద్లో 1964లో ఏర్పాటైన అగ్రికల్చర్ వర్సిటీ ఎన్నో వండగాలు రూపొందించి దేశవ్యాప్త ఆదరణ పొందిందన్నారు.
సన్న, చిన్న కారు రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వర్సిటీకి సూచించారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రయోజనకరమైన వ్యూహాల్ని అనుసరించాలన్నారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువులతో దేశంలో రైతులు కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయం తెలంగాణ సంప్రదాయ పంటలు, చిరుధాన్యాలపై పరిశోధనలు చేసి రైతాంగానికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, వర్సిటీ మాజీ వీసీ డాక్టర్ ఎస్.రఘువర్ధన్ రెడ్డి, వీసీలు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, డాక్టర్ డి.రాజిరెడ్డి, జ్ఞాన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.