ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి

ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతిచెందారు.ఆమె వయస్సు 30 సంవత్సరాలు.సురభి జైన్ మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సురభి చాలా కాలంగా ఆండాశయ క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతుంది. రెండు నెలల క్రితం సురభి క్యాన్సర్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాసింది.

నా ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. రెండు నెలలుగా ఆస్పత్రిలోనే ఉన్నాను. ఈ కష్టాలు వీలైనంత త్వరగా తీరాలని కోరుకుంటున్నాను అని సురభి ఇన్ స్టాగ్రామ్ లో రాసింది. సురభికి తొలిసారి 27 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకింది. అప్పుడు ఆమెకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. సర్జరీ అనంతరం తనకు 149 కుట్లు పడ్డాయని చాలా నొప్పిగా ఉందని తెలిపింది. సురభి జైన్.

సురభి జైన్ ఏప్రిల్ 18న మృతిచెందిందని.. ఆమె అంత్యక్రియలు ఏప్రిల్ 19న ఘజియాబాద్ లో నిర్వహించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.