హైదరాబాద్ శివారులోని గగన్ పహాడ్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం అదుపుతప్పి రోడ్డు ఓవర్ బ్రిడ్జిను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సదరు యువకులు క్వాలిస్లో హుక్కా పీలుస్తూ పాతబస్తీలోని జహనుమా నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. హుక్కా మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.