'ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్' రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

'ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్' రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

DRDO మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్ (84) లో కన్ను మూశారు. వయో సంబంధిత సమస్యలతో పోరాడుతూ హైదరాబాద్ లో  మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని జైపుర్లో జన్మించిన ఆయన 1983 లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్లో విశేష సేవలు అందించారు రామ్ నరైన్ అగర్వాల్. 'అగ్ని మిస్సైల్స్'కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన్ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్ గా పిలుస్తారు.

1990లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు రామ్ నరైన్. రక్షపురం లోని సంతోష్ నగర్ పోలీసు స్టేషన్ సమీపంలో భారత్ రత్న కాలనీలో అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.