సీబీఐ పేరుతో ఫెడెక్స్ ఫ్రాడ్.. రిటైర్డ్ సైంటిస్ట్ నుండి రూ. కోటి 30 లక్షలు కొట్టేశారు.

సీబీఐ పేరుతో ఫెడెక్స్ ఫ్రాడ్.. రిటైర్డ్ సైంటిస్ట్ నుండి రూ. కోటి 30 లక్షలు కొట్టేశారు.

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫెడెక్స్ పేరుతో కేటుగాళ్లు చేస్తున్న స్కాముల గురించి ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. నేరగాళ్ల వలకు చిక్కుతున్నవారి సంఖ్య తగ్గడంలేదు. తాజాగా హైదరాబాద్ లో మరో ఫెడెక్స్ మోసం బయటపడింది. సీబీఐ పేరుతో ఫేక్ కాల్ చేసిన కేటుగాళ్లు రిటైర్డ్ సైన్టిస్ట్ నుండి రూ. కోటి 30 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉప్పల్ కి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ సివేంద్రనాథ్ రాయ్ కి మే 31న సీబీఐ ఆఫీసర్ పేరుతో ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు. 

మీరు ఇతర దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీపై బెంగళూర్ లో కేసులు ఉన్నాయని... మీ దగ్గర ఉన్న అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తే అవి సుప్రీం కోర్టులో వెరిఫై చేసి తిరిగి పంపుతామని చెప్పి మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. మొదట టెలీ కమ్యూనికేషన్ నుండి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్ గా మాట్లాడి మోసానికి పాల్పడ్డారు. 

డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే సుప్రీంకోర్టులో వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని చెప్పిన కేటుగాళ్ల మాటలు నమ్మి రెండు దఫాలుగా రూ. కోటి 34 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎల్బీ నగర్ లోని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.