అసదుద్దీన్కు రాజాసింగ్ సవాల్
హైదరాబాద్, వెలుగు: దమ్ముంటే గోషామహాల్లో తనపై ఎంఐఎం అభ్యర్థిని పోటీలో పెట్టాలని అసదుద్దీన్కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. నువ్వు వచ్చినా సరే, నీ తమ్ముడు వచ్చినా సరేనన్నారు. బీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకొని గోషామహాల్లో అభ్యర్థిని డిసైడ్ చేయడం లేదని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలంటే ఓవైసీకి బిజినెస్లా మారాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ అభ్యర్థులను నిలబెడతామంటూ బ్లాక్మెయిల్ చేయడం ఓవైసీ బ్రదర్స్కు అలవాటుగా మారిందన్నారు.