గోషామహాల్లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టు: అసదుద్దీన్​కు రాజాసింగ్ సవాల్​

గోషామహాల్లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టు: అసదుద్దీన్​కు రాజాసింగ్ సవాల్​

అసదుద్దీన్​కు రాజాసింగ్ సవాల్​

హైదరాబాద్, వెలుగు: దమ్ముంటే గోషామహాల్​లో తనపై ఎంఐఎం అభ్యర్థిని పోటీలో పెట్టాలని అసదుద్దీన్​కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. నువ్వు వచ్చినా సరే, నీ తమ్ముడు వచ్చినా సరేనన్నారు. బీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకొని గోషామహాల్​లో అభ్యర్థిని డిసైడ్ చేయడం లేదని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలంటే ఓవైసీకి బిజినెస్​లా మారాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ అభ్యర్థులను నిలబెడతామంటూ బ్లాక్​మెయిల్​ చేయడం ఓవైసీ బ్రదర్స్​కు అలవాటుగా మారిందన్నారు.