అగ్గిపెట్టె కోసం లొల్లి.. దోస్తు హత్య

అగ్గిపెట్టె కోసం లొల్లి.. దోస్తు హత్య
  • జగద్గిరిగుట్టలో దారుణం

జీడిమెట్ల, వెలుగు: అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవలో ఇద్దరు తమ ఫ్రెండ్​నే  కత్తితో పొడిచి చంపేశారు.ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరకాలనీకి చెందిన మనోజ్​కుమార్(23), సంజయ్​పురికాలనీకి చెందిన రాజు(23), రోహన్​(24) ముగ్గురూ ఫ్రెండ్స్. వీరు ఫంక్షన్లలో బ్యాండ్ వాయిస్తుంటారు. బుధవారం రాత్రి 11 గంటలకు ఆస్బెస్టాస్ కాలనీ పార్కులో ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సిగరేట్ తాగేందుకు అగ్గిపెట్టె కావాలని రాజు, రోహాన్​లను మనోజ్ అడిగాడు. వాళ్లు ఇవ్వలేదు. దాంతో మనోజ్ వారితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో రాజు, రోహాన్ కలిసి మనోజ్ ను కత్తితో పొడిచి పారిపోయారు. మనోజ్​ను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు.