- జగద్గిరిగుట్టలో దారుణం
జీడిమెట్ల, వెలుగు: అగ్గిపెట్టె కోసం జరిగిన గొడవలో ఇద్దరు తమ ఫ్రెండ్నే కత్తితో పొడిచి చంపేశారు.ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరకాలనీకి చెందిన మనోజ్కుమార్(23), సంజయ్పురికాలనీకి చెందిన రాజు(23), రోహన్(24) ముగ్గురూ ఫ్రెండ్స్. వీరు ఫంక్షన్లలో బ్యాండ్ వాయిస్తుంటారు. బుధవారం రాత్రి 11 గంటలకు ఆస్బెస్టాస్ కాలనీ పార్కులో ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సిగరేట్ తాగేందుకు అగ్గిపెట్టె కావాలని రాజు, రోహాన్లను మనోజ్ అడిగాడు. వాళ్లు ఇవ్వలేదు. దాంతో మనోజ్ వారితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో రాజు, రోహాన్ కలిసి మనోజ్ ను కత్తితో పొడిచి పారిపోయారు. మనోజ్ను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు.