పుస్తకాలతోనే విజ్ఞానం, వికాసం :సుద్దాల అశోక్ తేజ

పుస్తకాలతోనే విజ్ఞానం, వికాసం :సుద్దాల అశోక్ తేజ

ముషీరాబాద్, వెలుగు: పుస్తకాలతోనే విజ్ఞానం, వికాసం వస్తుందని సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ నేషనల్ బుక్​ఫెయిర్​ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంతో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు.  

బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్​తో కలిసి పలు స్టాళ్లలోని పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజానికి మంచి సందేశాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ చాలా బాగుందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి సైతం స్టాళ్లను సందర్శించారు.