జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం.. పలు ఫైల్స్ దగ్ధం..

జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం.. పలు ఫైల్స్ దగ్ధం..

సూర్యాపేట జిల్లా  కోదాడలోని జూనియర్ సివిల్ కోర్టులో పెను ప్రమాదం తప్పింది. కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్ తో కోర్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కోర్టులోని బీరువాల్లోని పలు దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్నిప్రమాదం అర్థరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది.  మూడు రోజులు కోర్టుకు సెలవులు కావడంతో సిబ్బంది గమనించలేదు. 

ఇవాళ తెల్లవారు జామున కోర్టు తెరిచి చూసే సరికి పలు ఫైల్లు దగ్ధమయి ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిందని అంచనా వేశారు. ఘటన స్థలానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్యాంసుందర్, విద్యుత్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు.  విచారణ చేసి కోర్టుకి రిపోర్టు సబ్మిట్ చేయాలని విద్యుత్ శాఖకి వినతిపత్రం అందించారు కోర్టు సిబ్బంది.