ఉదయం 4.30 గంటలకు.. ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..

ఉదయం 4.30 గంటలకు..  ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..

గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. . షాహిబాగ్‌లోని రాజస్థాన్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లో  2023 జూలై 30 ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

దీంతో వెంటనే వందమంది పేషంట్లను స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులకు  తరలించారు.  మంటలను అదుపు చేసేందుకు 31 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.  

ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి  గాయాలు జరగలేదు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్పత్రిలోని బేస్‌మెంట్‌ నుంచి పొగలు వస్తూ పై అంతస్తులకు చేరాయని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది.