కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లో కాంగ్రెస్​మరింత బలపడుతోంది. వికారాబాద్​మున్సిపాలిటీలోని ఐదుగురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్​పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నవారిలో కౌన్సిలర్లు హీరేకార్ సురేశ్, నవీన్, లంకా పుష్పలతారెడ్డి, బొండల సువర్ణ, మంజుల ముత్యంరెడ్డితోపాటు శివారెడ్డిపేట పీఏసీఎస్​చైర్మన్ ముత్యంరెడ్డి

గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హాఫిజ్, నాయకులు బొండల అశోక్, బొండల శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, వడ్డె అంజయ్య, నర్సింహులు, రాజమల్లు, ఈశ్వర్, సత్యనారాయణరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్​టౌన్​కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, నాయకులు కిషన్ నాయక్, రత్నారెడ్డి పాల్గొన్నారు.