
ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ గులాబీ పూలమయం అయింది. కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సభలకు హాజరయ్యేందుకు రాయ్పూర్కు చేరుకున్న ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ శ్రేణులు పూల వర్షం కురిపించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు చేరుకుని గులాబీ పూలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఉదయం 8.30 గంటలకు ప్రియాంక గాంధీ రాయ్పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్, పీసీఎస్ చీఫ్ మోహన్ మార్కం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రియాంక గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ర్యాలీగా కాన్వాయ్పై బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ గులాబీలను చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా దారిపై పొడవునా గులాబీ పూలను పేర్చారు. అటు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతంతో ప్రియాంకగాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.