విశాఖ: లాక్ డౌన్ కారణంగా అరకు విశాఖ ఘాట్ రోడ్ లో మూగ జీవాలకు ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. లాక్ డౌన్ రూల్ ఉండటంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వెళ్లలేని పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముందు వందల వాహనాలు అరకు ఘాట్ రోడ్ లో వెళ్తూ.. ప్రయాణికులు వేసే తిను బండారాలు, పళ్ళు, తింటూ మూగ జీవాలు కడుపు నింపు కునేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఘాట్ రోడ్ లో టూరిస్టులు తిరగటం లేదు. అనుకోకుండా ఒక్క వాహనం చప్పుడైనా ఆశతో కోతులు గుంపులుగా ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది గమనించిన కొందరు అరకు ఘాట్ రోడ్ లో మూగ జీవాలకు పళ్ళు, ఆహారం ఇచ్చి తన ఉధారతను చాటుకున్నారు.