ఎలక్షన్​ కమిషనర్​గా గోయల్​ బాధ్యతల స్వీకరణ

ఎలక్షన్​ కమిషనర్​గా గోయల్​ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ: కొత్త ఎలక్షన్​ కమిషనర్​గా మాజీ బ్యూరోక్రాట్​ అరుణ్​ గోయల్​ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గోయల్..​1985 బ్యాచ్​ పంజాబ్ ​క్యాడర్ ఐఏఎస్​ అధికారి. నవంబర్​ 18న వాలంటరీ రిటైర్మెంట్​ తీసుకున్నారు. ఎలక్షన్​ కమిషనర్​గా ఉన్న సుశీల్​ చంద్ర మే నెలలో పదవీ విరమణ చేయగా ఎలక్షన్ కమిషన్​లో ఖాళీ ఏర్ప డింది. ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం శనివా రం అరుణ్​ గోయల్​ను ​ఎంపిక చేయగా .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. గోయల్.. ఇంతకు ముందు భారీ పరిశ్రమ ల సెక్రటరీగా పనిచేశారు. కేంద్ర సాంస్కృతి క మంత్రిత్వ శాఖలోనూ సేవలందించారు. సీఈసీ​ రాజీవ్​ కుమార్​, ఎలక్షన్​ కమిషనర్ అనూప్ ​చంద్ర పాండేతో కలిసి గోయల్​పనిచేయనున్నారు. గుజరాత్​లో డిసెంబర్​1, 5న రెండు దశలలో ఎన్నికలు జరగడానికి ముందు గోయల్​ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.