రాజ్యసభకు రంజన్ గొగోయ్

రాజ్యసభకు రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ రంజన్‌ గొగోయిని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. గత నవంబర్‌లో పదవీ విర మణ చేసిన గొగోయ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా 13 నెలలు పనిచేశారు. ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరుకున్నది ఆయన ఒక్కరే. ఆయన పదవీ కాలంలో చివరిగా ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. రాజకీయంగా, మతపరంగా దశాబ్దాల తరబడి పరిష్కారం కాని బాబ్రీ మసీదురామజన్మభూమి అంశంపై ఆయన నేతృత్వంలోని బెంచ్‌ ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది.