ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు కేసీఆర్

ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు  కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్ ,మాజీ సీఎం కేసీఆర్  తెలంగాణ భవన్ కు వచ్చారు. కేసీఆర్ కు పార్టీ నేతలు ఘన స్వాగం పలికారు. కేసీఆర్ వెంట కేటీఆర్ ,హరీశ్ రావు పలువురు నేతలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎర్రవెల్లి ఫాంహౌస్ లోని బాత్రూంలో కేసీఆర్ కింద పడ్డ సంగతి తెలిసిందే.  కాలి తుంటి ఆపరేషన్   చేయించుకుని రెస్ట్ తీసుకున్న కేసీఆర్.. ఇవాళ  మొదటి సారిగా తెలంగాణ భవన్ కు వచ్చారు.  

కాసేపట్లో  కృష్ణా జలాల అంశం, బోర్టుకు ప్రాజెక్టులు అప్పగింత అసెంబ్లీ సమావేశాలపై  ఉమ్మడి  మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించనున్నారు.కేబినెట్ నిర్ణయాలు, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పై నేతలకు నిర్దేశం చేయనున్నారు. అలాగే జనవరి 13న ఉమ్మడి నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.