సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీరి దెబ్బకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బాధితులుగా మారుతున్నారు. లేటెస్టుగా టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ వీరి బారిన పడ్డాడు. ఈ నెల 3వ తేదీన నో యువర్ కస్టమర్ (KYC)పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని కేవైసీని అప్ డేట్ చేసుకోవాలని కోరాడు. అయితే అతని వివరాలను సరిగ్గా కనుక్కోకుండానే.. అతను పంపిన లింకులను క్లిక్ చేసి కాంబ్లీ వివరాలను సెండ్ చేశాడు.
ఆ వెంటనే కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.13 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటనలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కాంబ్లీ ఫిర్యాదు చేశాడు.ఆ వ్యక్తి నుంచి వరుసగా ఫోన్లు రావడం వల్లే వివరాలను ఇచ్చానని చెప్పాడు. కాంబ్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.